Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం ఆర్టీసీ ఎమ్డీ చర్చలు జరపాలని 18న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. చర్చలు సానుకూల ఫలితాలు ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎమ్డీలు పిటిషనర్లను చర్చలకు ఆహ్వానించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీసీ యాక్ట్-1950లోని సెక్షన్ 34 ప్రకారం చర్చలు జరపాలని కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. చర్చలు జరిపి ఆర్టీసీ సమ్మె పరిష్కారం అయ్యేలా చేసి సామాన్యుల కష్టాలకు తెరదించుతారని ఆశిస్తున్నట్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.
రవిప్రకాశ్ అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే ఆయన విడుదల కాకుండానే ఇంకో కేసులో పోలీసులు ఆరెస్టు చేయడంపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని కేసుల్లోనూ ఒకేసారి ఎందుకు అరెస్ట్ చూపడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి ప్రశ్నించారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో రవిప్రకాశ్ను పోలీసులు అరెస్ట్ చేశారనీ, తాజా కేసులో పోలీస్ కస్టడీకి ఇవ్వకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన లాయర్ కోరారు. గురువారం వరకూ స్టే ఇస్తున్నామనీ, ఆదే రోజు కేసును తుది విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.