Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెను ఆటవికంగా అణచివేస్తున్న ప్రభుత్వం
- ఆర్టీసీ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతా :సీపీఐ ఎంపీ బినరు విశ్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గూండారాజ్యం సాగు తున్నదని సీపీఐ ఎంపీ బినరు విశ్వం విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆటవికంగా ఈ ప్రభుత్వం అణచివేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ చర్యలు అప్రస్వామికమని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతానని వివరించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ కె రాజిరెడ్డిని శనివారం పహడీషరీఫ్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆయన మీడియాతో ధర్నాచౌక్లో అనుమతి ఇవ్వనందువల్లే ఇంటివద్ద దీక్ష చేస్తున్నారని చెప్పారు. ఫాసిస్టు పాలన తరహాలో పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. మహిళా కార్మికులనూ మగ పోలీసులే అరెస్టు చేశారని విమర్శించారు. నిరసనలకు అవకాశం ఇవ్వనపుడు ధర్నాచౌక్ ఎందుకని ప్రశ్నించారు. అది ధర్నాచౌక్ కాదని సీఎం కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల నుంచి వసూలు చేసిన పీఎఫ్ సొమ్మును దారి మళ్లించారని విమర్శించారు. ఇది చట్టవిరుద్ధమని, దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. 29 మంది కార్మికులు మరణించారని చెప్పారు. ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల జీతాలు చెల్లించకపోవడం అమానుషమని అన్నారు. విలీనం ఏపీలో సాధ్యమైనపుడు ఇక్కడెందుకు కాదని ప్రశ్నించారు. ఖరీదైన ఆర్టీసీ భూములు, ఆస్తులను తన అనుయాయులకు కట్టబెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ప్రజాస్వామ్యంలో ఉందా? నియంతృత్వంలో ఉందా?అన్న అనుమానం కలుగుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్పాషా చెప్పారు. హైకోర్టు నిస్సహాయతను వ్యక్తం చేసే పరిస్థితి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈయూ గౌరవాధ్యక్షులు టి నరసింహన్, ఏఐటీయూసీ అథ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాల్రాజ్, విఎస్ బోస్ తదితరులు పాల్గొన్నారు.