Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
న్యాయబద్దమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్క రించాలని చేపట్టిన సబ్బండ కులాల మహాదీక్ష సందర్భంగా చేసిన అరెస్టులు అప్రజాస్వామికమని తెలంగాణా బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ ఒక ప్రకటనలో ఖండించారు. ఇందిరాపార్క్ వద్ద తాము శాంతియుతంగా ధర్నా చేసేందుకు యత్నించగా అనుమతి లేదనే సాకుతో అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు విధించినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేసే వర కు పోరాటం విరమించేది లేదని పేర్కొన్నారు. ఆ ఆందోళన లో ప్రజాస్వామ్య వాదులందరూ కలిసి రావాలని కోరారు.