Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో, రాష్ట్రంలో పరిపాలనా పరమైన సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రశాషన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆబిడ్స్లోని మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గ్రూప్-2 విజేతల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పురాతనమైన పరిపాలనా విధానాలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేవని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను సావధానంగా విని వాటిని పరిష్కరించాలని కొత్తగా గ్రూప్-2 ఉద్యోగులుగా విధుల్లో చేరనున్నవారికి సూచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించడం వల్లనే కొత్త ఉద్యోగాలు సాధ్యం అయ్యాయని వినోద్ కుమార్ తెలిపారు.