Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మహనీయుడు బుద్దుడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ) లో రెండురోజులుగా జరుగుతున్న బౌద్ధసంగిటీ-2019 ముగింపు సదస్సులో మాట్లాడుతూ బౌద్దిజం మొదలైన కాలానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు. ఆరోజుల్లో కంటే ఇప్పటి సమాజానికి బౌద్ధిజాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బౌద్దిజానికి ప్రతీకలనీ, మధ్యలో కొన్నిఒడి దుడుకులు ఎదురైనా ప్రాశస్త్యం తగ్గినట్టు కనిపించినా తెలంగాణ సమాజం పుట్టుకలోనే బౌద్ధిజం కలిసిపోయిందని గుర్తు చేశారు. శిధిలాల కింద కప్పబడిన విగ్రహాలు బయటకు రావడం కంటే కూడా బౌద్ధిజం ఆలోచనలు బయటకు తీసుకు రావాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ధారులాండ్, నేపాల్, భూటాన్ తదితర 17 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు