Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్సీటీ
తండ్రి మరణం తట్టుకోలేక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బ్రిడ్డి నుంచి ఓ యువతి నదిలోకి దూకింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన వసంతం సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్తున్నారు. గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జిపైకి రాగానే వెనుక కారులో వస్తున్న కూతురు సాయిప్రియ(32) తనకు వాంతి వస్తుందని వాహనాన్ని ఆపింది. కిందికి దిగి కుటుంబ సభ్యులు చూస్తుండగానే బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకింది. ఓ వైపు కుటుంబ పెద్ద చనిపోవడం.. మరోవైపు కూతురు నదిలో కళ్లెదుటే మునిగి గల్లంతవ్వడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.