Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీఎస్సీ-2002, 2003 ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ను బుధవారం హైదరాబాద్లో టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 2004, సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్) అమలైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004, జనవరి ఒకటి తర్వాత నియామకమైన వారికి సీపీఎస్ వర్తింపచేశారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే పరిగణించాలి : సీఎస్కు టీపీటీఎఫ్ వినతి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే రాష్ట్రంలోని ఉద్యోగులనూ పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది.
సీపీఎస్ రద్దు చేయాలి : సీపీఎస్టీఈఏ
రాష్ట్రంలో సీపీఎస్ను రద్దు చేయాలని సీపీఎస్టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి : ఆర్సీటీఏ
పీఆర్సీ గడువు పొడిగింపు సరైంది కాదని రిటైర్డ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (ఆర్సీటీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ విద్యాసాగర్, నెహ్రూప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.