Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రియల్ ఎస్టేట్ వ్యాపారులను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యంతో కొనుగోలుదార్లు నష్టపోతు న్నారని హుడా మాజీ చైర్మెన్ కోదండరెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాల్లో అనుభవం, అనుమతిలేని వారు ఇష్టానుసారం గా భవనాలను నిర్మిస్తున్నారని తెలిపారు. బిల్డర్ల నుంచి కొనుగోలుదార్లను రక్షించేందుకు 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం చేసినా రాష్ట్రంలో పూర్తి స్థాయి రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అథారిటీ ఏర్పాటు చేసినా రాష్ట్రంలో ఎందుకు చేయలేదో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బిల్డర్లకు అన్ని విధాల సహాయం చేస్తున్న కేటీఆర్ కొనుగోలుదారుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. అంబర్పేటలో మహాత్మాజ్యోతి రావు ఫూలే ఆడిటోరియం నిర్మించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. అంబర్పేటలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయనీ, వాటిని పరిరక్షించాలని కోరారు.