Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సూరత్ మున్సిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిలో ట్రైనీ క్లర్కులను గర్భధారణ పరీక్షల పేరుతో నగంగా నిలబెట్టి పరీక్షించడం అమానుషమనీ, అందుకు సంబంధించిన దోషు లను కఠినంగా శిక్షించా లని ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కె.నాగలక్ష్మి, ఆర్.అరుణజ్యోతి డిమాండ్ చేశా రు.గుజరాత్లోని బుజ్ కాలేజీ ఘటన మరువక ముందే సూరత్లో ఇటువంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నదనీ, మహిళలకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులు భంగపరిచే విధంగా ప్రభు త్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం గా తెలిపినా, ఇలాంటి వివక్షత కొనసాగడం విచారకరమనీ, ఇటు వంటి చర్యలకు పాల్పడిన సూరత్ మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.