Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదర్శ పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్ల ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్లో చెన్నుపాటి భవన్లో టీఎస్ఎంఎస్టీఎఫ్ అధ్యక్షులు బి కొండయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న పీడీలకు 12 నెలల వేతనం ఇవ్వాలనీ, ప్రతినెలా వేతనాలు సకాలంలో చెల్లించాలనీ, మహిళా పీడీలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలనీ కోరారు. మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే జీవో నెంబర్ 14 ప్రకారం సమానపనికి సమాన వేతనం చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ మహేష్ పాల్గొన్నారు. మోడల్ స్కూల్ పీడీలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎ యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా నాగన్న, ఉపాధ్యక్షులుగా యు శశిరేఖ ఎన్నికయ్యారు.