Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బున్నోళ్లకే బీఫామ్ ఇచ్చాం...!
- మా వద్ద ఉన్నోళ్లంతా డబ్బున్న లీడర్లే.. : మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
'మున్సిపల్ ఎన్నికల్లో సమాజ సేవ చేసేవారికి సీట్లివ్వలేదు. డబ్బున్న వారికే పార్టీ బీఫామ్లు ఇచ్చాం. మా వద్ద ఉన్నవారంతా డబ్బున్న లీడర్లే' అంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీర్జాది గూడ కార్పొరేషన్లో ఇటీవల మున్సి పల్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు సమాజంలో సేవ చేస్తున్నారని బీఫామ్ ఇవ్వలేదనీ, వారి వద్ద ఉన్న డబ్బును చూసే టికె ట్లు ఇచ్చామనీ చెప్పారు. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి
పీఎస్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్తో కలిసి శనివారం ప్రారంభించారు. సభలో మంత్రి మాట్లాడుతూ... 3వ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నేత అయిన బైటింటి ఈశ్వర్రెడ్డి పార్టీకి విశేషంగా సేవచేసినా కొన్ని పరిణామాల వల్ల సీటు ఇవ్వలేదన్నారు. అతని భార్య శారద స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారంటే ఆయన చేసిన సేవే కారణమన్నారు. తమ పార్టీలో డబ్బున్న లీడర్లే ఉన్నారు కాబట్టి.. వారితో ఎన్ని కెమెరాలైనా పెట్టించుకోవాలని సీపీకి మంత్రి చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటులో అన్ని ప్రధాన నగరాల కంటే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. అందులోనూ రాచకొండ కమిషనరేట్ మొదటిస్థానమన్నారు. అవసరమైనచోట మరిన్ని ఏర్పాటు చేసేందుకు నాయకులు, స్థానికులు చొరవ చూపాలని కోరారు. సభలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ నరసింహ్మరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ జక్కా వెంకట్రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.