Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-కాగజ్నగర్
కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పేపర్ మిల్లులో శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. బాయిలర్ కుప్పకూలడంతో 8 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అందులో జార్ఖండ్కు చెందిన రఘునాథ్రాం(38), చోటు భయ్యా(25), ఉత్తరప్రదేశ్కు చెందిన రంజిత్(25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు కార్మికులు మల్లు రాందాస్, సంతోష్రాం, పరికైరాం, రన్ప్రీత్రాం, సజరురాం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన కాగజ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. పరికైరాం కాలుకు, తలకు తీవ్రగాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఏఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, డీఎస్పీ స్వామి, సీఐ మోహన్ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని ఆదివారం ఆసిఫాబాద్ ఇన్చార్జి ఎస్పీ విష్ణు వారియర్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సందర్శించి వివరాలు అడిగితెలుసుకున్నారు.