Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపు
నవతెలంగాణ-గుడిహత్నూర్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. బాలికపై అదే గ్రామానికి చెందిన ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిం చారు. ఇన్చార్జి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదివారం సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రోహిణి తో కలిసి ఘటనను మీడియాకు వివరిం చారు. ఒడ్డెరకాలనీలో నివాసముండే బాలిక(14) శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. కాపుకాచి ఉన్న ఇద్దరు బాలురు బాలికను లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు కూలి పనులకెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత బాలిక నీరసంగా ఉండటాన్ని గమ నించి ఏమైందని అడగడంతో జరిగిన విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆది వారం ఆ ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు.