Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ : పరిపాలన భాషగా మాతృభాషనే ఉండాలనీ, మాతృభాష వస్తేనే ఉద్యోగం ఇవ్వాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్ నగరంలో ఆంధ్రా విద్యాభివర్ధని విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ వేడుకులను ఆయన ఆదివారం ప్రారంభించారు. ప్లాటినం జూబ్లి బ్లాక్ 'రోహిణి'కి శంకుస్థాపన చేసి, సంస్థ రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. ఉర్ధూ మీడియం తప్పా తెలుగులో విద్యనభ్యసించే అవకాశం లేని రోజుల్లో నిజాం నవాబును ఒప్పించి, ఎదిరించి చందా కాంతయ్య ఏవీవీ పాఠశాలను స్థాపించడం అభినందనీయమన్నారు. ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీలను, సీకేఎం ఆస్పత్రిని స్థాపించడానికి ఆస్తులు విరాళమిచ్చి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలుగు భాష గొప్పదనీ, కానీ మాతృభాష గొప్పదనాన్ని మనమే నిర్వీర్యం చేస్తున్నామనీ అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం తెలుగును ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. దేశంలో నిర్భయలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. ఏవీవీ ఉన్నత పాఠశాలలోనే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నాననీ, చదువు అబ్బక పోయినా క్రమశిక్షణ అబ్బిందనీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కార్యక్రమంలో హోం మంత్రి మహిమూద్ అలీ, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, చీఫ్విప్ దాస్యం వినరుభాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్రావు పలువురు పాల్గొన్నారు.