Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు నష్టపోకుండా చూడాలి : ఎస్ఎఫ్ఐ రౌండ్టేబుల్లో
వక్తల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గుర్తింపు లేని విద్యా సంస్థల్లోని విద్యార్థులు నష్టపోకుండా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనుమతులు, గుర్తింపు లేకుండా కాలేజీలు నడిపిన శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రీ సంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. 'కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు, ప్రభుత్వ విధానాలు, పర్యవసానాలు, ప్రస్తుత నోటీసులు' అనే అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన ఆదివారం హైదరాబాద్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి అధ్యక్షత వహించారు. ప్రయివేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల లక్ష్మయ్య, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పరశురాం, ఏఐడీఎస్వో రాష్ట్ర కార్యదర్శి గంగాధర్, టీవీవీ రాష్ట్ర నాయకులు మహేష్, తెలంగాణ రైతు సంఘం సహయ కార్యదర్శి మూడ్ శోభన్ నాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.విజరు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కో -ఆర్డినేటర్ రవికాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కె.విజేత, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, ఎమ్డీ జావేద్, రాష్ట్ర కమిటీ సభ్యులు హస్మిత, నాయకులు సాగర్,హస్మి, నరేష్, అనిల్, ఏఐడీఎస్వో హైదరాబాద్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సతీశ్ మాట్లాడుతూ... హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ, మణికొండ, మాదాపూర్, గండిపేటలాంటి ప్రాంతాల్లో గుర్తింపు లేకుండానే శ్రీచైతన్య, నారయణ సంస్థలు గత మూడేండ్లుగా నడుస్తున్నాయని తెలిపారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులనూ, స్టడీ అవర్ల పేరిట విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నా యని చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టనట్టు వ్యవహ రిస్తున్నారని విమర్శించారు. నోటీసులు అందుకున్న 79 కాలేజీలతో సరిపెట్టకుండా అన్ని కార్పొరేట్ సంస్థలపైనా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష్మయ్య మాట్లాడుతూ... ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాంటూ పేరెంట్స్ అసోసియేషన్ తరపున గతంలో ఆందోళన నిర్వహించామని గుర్తుచేశారు. గతేడాది దాదాపు 30 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం లో కాలేజీలపై చర్యలు తీసుకోకుండా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో గందరగోళం సృష్టించట మేంటని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే కార్పొరేట్ కళాశాలల భరతం పడతామం టూ గతంలో చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యా యని ప్రశ్నించారు. ఆయా కళాశాలల ఆగడాలకు, ఫీజుల దందాకు ప్రభుత్వం, ఇంటర్ బోర్డే బాధ్యత వహించాలని అన్నారు. శోభన్ మాట్లాడుతూ..తమ పిల్లలు డాక్టర్లో, ఇంజినీర్లో కావాలనే ఆశతో గ్రామాల్లోని రైతులు రూపాయి రూపాయి పోగేసి కార్పొరేట్ కాలేజీలకు పంపుతున్నారని తెలిపారు. ఆయా కళాశాలలు ఫీజుల పేరిట చుక్కలు చూపిస్తున్నాయని చెప్పారు. కాలేజీల పీఆర్వోల మంటూ వచ్చి రైతుల్ని, జనాల్ని డిస్కౌంట్ల పేరుతో మోసం చేస్తున్న వారిని నిలదీయాలని కోరారు. నాగ రాజు మాట్లాడుతూ... ఇప్పటి వరకూ ప్రకటించిన గుర్తింపు లేని కళాశాలలను మూసే యాలని అన్నారు. ఇదే సమయంలో అక్కడ చదువుతున్న 18,860 మంది విద్యార్థులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
రౌండ్టేబుల్ తీర్మానాలు...
1. కార్పొరేట్ కాలేజీల దందాను,ఆగడాలను వివరిస్తూ గ్రామాలో సంతకాల సేకరణ చేపట్టాలి
2. అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు
ఈ అంశాలపై అవగాహన కల్పించాలి
3. కార్పొరేట్ విద్యా సంస్థల పీఆర్వోలను తరిమికొట్టాలి