Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వలస కూలీలకు రూ.10 వేలు చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. మంగళవారం సీపీఐ తెలంగాణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, కె రామకృష్ణ హైదరాబాద్లోని ఫిలింనగర్ పరిధిలోని వినాయక్నగర్లో వలస కూలీల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీకి చెందిన వారు వలస కూలీలు పదేండ్ల నుంచి ఉంటున్నారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు కనిపించారని పేర్కొన్నారు. కొందరికి తెల్లరేషన్కార్డులున్నాయనీ, చాలా మందికి ఏ కార్డూ లేదని తెలిపారు. కార్డు ఉన్నా, లేకున్నా పేదలందరికీ 12 కిలోల బియ్యం, రూ.1,500 నగదు చెల్లించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి : న్యూడెమోక్రసీ
ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో భారీగా కోత విధించడం ఏకపక్షంగా ఉన్నదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ఉద్యోగులు ఐచ్చికంగా ప్రకటించేటట్టు ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. వలస కూలీలను ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి వారి స్వస్థలాలకు పంపించాలని కోరారు. వారిని ఆదుకోవాలని తెలిపారు. వలస కూలీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
పేదలకు సహాయం చేస్తున్న మిలాప్
కరోనా మహమ్మారి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో మిలాప్ సంస్థ పేదలకు సహాయం చేస్తున్నది. ఈ మేరకు మిలాప్ సీఈవో మయూఖ్చౌదరి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ను మిలాప్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 40 వేల మందికిపైగా దాతల నుంచి రూ.10 కోట్లు అత్యవసర వైద్య సహాయం, విపత్తుల నుంచి ఉపశమనం కోసం సమీకరించామని పేర్కొన్నారు. చెన్నై, అస్సాం, కేరళలో వరదల సమయంలో సహాయం చేశామని గుర్తు చేశారు. బలహీన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు.