Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కోరని దయానంద్ పిలుపు నిచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆరంగార్ చౌరస్తా నుంచి దుర్గానగర్ చౌరస్తా వరకూ రోడ్లపై వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. మంగళవారం నేనున్నానంటూ వలస కార్మికులకు బాసట నిలిచారు. దయానంద్ సొంత ఖర్చులతో 400 మందికి భోజనం అందజేశారు. వలస కార్మికులు ఆకలితో బాధపడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని రక్షించాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. వలసదారులు అధైర్యపడవద్దన్నారు.