Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మందుకు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) నగర నాయకులు ఎం.మహేందర్ అన్నారు. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లో బాగ్ అంబర్పేట్ వితంతు, వికలాంగులకు రీటైడ్ బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసరాజు సాయంతో 50 మందికి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.