Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
కరోనా మహమ్మారి మరోసారి వనస్థలిపురం వాసులను కలవరపెట్టింది. మంగళవారం పోలీసులు, వైద్య సిబ్బంది మూకుమ్మడిగా వనస్థలిపురంలోని ప్రశాంత్నగర్కాలనీ, జాహంగీర్నగర్కు చేరడంతో స్థానికులు తీవ్ర భయాం దోళనలకు గురైయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ మత ప్రార్థనలకు హాజరైన వారిలో వనస్థలిపురానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు, వైద్య సిబ్బంది వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేజ్-2, ప్రశాంత్నగర్, జాహంగీర్కాలనీలకు చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విజయపురీకాలనీ ఫేజ్-2లో నివాసముండే మహ్మద్జిలానీ(47), జాహంగీర్నగర్ కాలనీలో నివాసముండే మహ్మద్సహీముల్లా(50), వనస్థలిపురం ప్రశాంత్నగర్లో నివాసముండే సాదిక్(65) ఈ ముగ్గురు కలిసి ఢిల్లీలో జరిగిన మతప్రార్థనలకు హజరై ఈ నెల 18వ తేదీన తిరిగి నివాసాలకు చేరుకున్నారు. వీరిలో మహ్మద్జిలానీ ఈ నెల 20వ తేదీన కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు వెళ్లిపోయాడు. ఢిల్లీలో జరిగిన మతప్రార్థనలకు హాజరైన వ్యక్తులకు కరోనా సోకిందనే వార్త బయటికి రావడంతో వారి వివరాలు సేకరించగా అందులో వనస్థలిపురం వాసులు ముగ్గురు ఉన్నారు. వెంటనే స్పందించిన వైద్య బృందం జాహంగీర్నగర్ కాలనీలో నివాసం ఉన్న మహ్మద్ సహీముల్లా, ప్రశాంత్నగర్కు చెందిన సాదిక్ను ప్రత్యేక వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబసభ్యులను కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం సహీ ముల్లా, సాదిక్ కుటుంబసభ్యులకు కరోనా లక్షణాలు లేనప్పటికీ ముందస్తు జాగ్రత్తగా 15రోజులు హౌంక్వారంటీన్లో ఉండాల్సిందిగా సూచించినట్టు తెలిసింది.