Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు
నవతెలంగాణ- కొండాపూర్/గండిపేట్
లాక్డౌన్తో తొమ్మిది రోజులుగా కల్లు దుకాణాలు బంద్ చేయడంతో కల్లు దొరక్క మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తూ ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్కు చెందిన సత్యనారాయణ(35) వింతచేష్టలు చేయడంతో కుటుంబ సభ్యులు సోమవారం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన అమ్రాది నాగయ్య(75) కూడా వింతగా ప్రవర్తిస్తూ సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం గ్రామం శివారులో ఉన్న బావిలో అతని మృతదేహం లభించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్పూర్కి చెందిన దాసరీ వెంకటయ్య(60) కూలీ పనులు చేసుకుంటాడు. కల్లుకు బానిసైన ఇతను సోమవారం కోమలోకి వెళ్లి, అలాగే మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.