Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నేటి నుంచి ఆంధ్రా బ్యాంక్ అదృశ్యం
హైదరాబాద్ : దాదాపుగా 96 ఏండ్లపాటుగా వినియోగదారులకు సేవలందిస్తున్న ఆంధ్రా బ్యాంకు ప్రస్థానం 2020 మార్చి 31 నాటికి ముగిసినట్లయ్యింది. ఏప్రిల్ 1 నుంచే యూబీఐలో విలీనం అమల్లోకి రానుంది. మోడీ సర్కార్ పెద్ద బ్యాంక్ల మోజుతో 2009 ఆగస్టులో 10 బ్యాంక్ల విలీనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఆ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో భాగంగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయడం ద్వారా ఎస్బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంక్గా అవతరించనుంది. కెనరా బ్యాంకును సిండికేట్ బ్యాంక్లో విలీనం అవుతుంది. ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ కలిసిపోయింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు తొలుత 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. ప్రస్తుతం 18 బ్యాంకులుగా ఉన్నాయి. తాజా విలీనంతో వచ్చే నెల ఒక్కటో తేది నుంచి ఇవి ఏకంగా 12 బ్యాంకులకు తగ్గిపోనున్నాయి.
గతేడాది దేనా బ్యాంక్, విజయా బ్యాంక్లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. అంతక్రితం ఎస్బీఐలో ఆ సంస్థ ఐదు అసోసియేట్ బ్యాంక్లతో పాటుగా భారతీయ మహిళ బ్యాంక్ను కలిపేశారు. స్వాతంత్య్ర సమరయోథుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబర్ 20న ఆంధ్రాబ్యాంక్ను స్థాపించారు. శత వసంతాల సంబరాలకు సిద్ధమవుతున్న వేల బీజేపీ సర్కార్ నిర్ణయం తెలుగోళ్లకు చేదు వార్తనే. రూ.4 లక్షల కోట్ల పైగా వ్యాపారం కలిగిన ఆంధ్రా బ్యాంక్ 2,885 శాఖలతో విస్తరించి సేవలందిస్తున్న ఈ బ్యాంక్ ఇకపై చరిత్రలో మిగిలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్గా ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) వ్యవహారించనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఇప్పటి వరకు ఆంధ్రా బ్యాంక్ కన్వీనర్గా ఉంది. మోడీ సర్కార్ యూబీఐలో ఆంధ్రా బ్యాంక్ను విలీనం చేయడం ద్వారా ఈ పరిస్థితి నెలకొంది.