Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ విప్లవ రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్రకమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఒక ప్రకటన విడుదల చేశారు. భీమాకోరే గావ్ కేసులో ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి ముంబయిలోని తలుజా జైల్లో నిర్బంధించారని విమర్శించారు. కరోనా వల్ల జైల్లో ఓ వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అనేక జైళ్లలో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై విడుదల చేశారని గుర్తు చేశారు. ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే ఆయన్ను విడుదల చేసి ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
వరవరరావు ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత: పౌరహక్కుల సంఘం
వరవరరావు ఇతర రాజకీయ ఖైదీల ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంఘం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా మరణాల దష్ట్యా వరవరరావుతో పాటు జైళ్ళలోని మిగతా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని కోరింది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే కరోనా నిబంధనలను పాటిస్తూ, రాజకీయ ఖైదీల విడుదలకోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించింది.