Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి సంస్థ (నాబార్డ్) చైర్మెన్గా జిఆర్. చింతల బుధవారం బాద్యతలు స్వీకరించారు. డిల్లీలోని ప్రఖ్యాత వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యూవేషన్ చేసిన ఆయన నాబార్డ్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ముంబై, హైదరాబాద్, చండీఘర్, లక్నో, అండమాన్ నికోబార్ తదితర ప్రాంతీయ కార్యాలయాల్లో విషేశమైన సేవలందించారు. హైదరాబాద్లోని అగ్రి బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉపాధ్యక్షులుగా కూడా పని చేశారు. 2006 లో ప్రాంతీయ బ్యాంకుల సమ్మేళనం కోసం రూపొందించిన రోడ్మ్యాప్లో కీలక పాత్ర పోషించారు. అమెరికా, చైనా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, కెన్యా, ఇండోనేషియా తదితర 20కి పైగా దేశాల్లో గామీణాభివృద్ధి తదితర అంశాలపై జరిగిన సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. గ్రామీణాభివృద్ధి రంగంలో చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఇటీవల నాబార్డ్ చైర్మెన్గా నియమించింది.