Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలను ఈసారి నిరాడంబరంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఎగరేయాలని ఆయన కోరారు. సభలు, సమావేశాలు నిర్వహించొద్దని నొక్కిచెప్పారు.
నేటి నుంచి మాల్స్ మినహా అన్ని షాపులూ ఓపెన్
హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవటానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపును తప్పించి.. మరో షాపును తెరిచే వెసులుబాటును కల్పించినప్పటికీ జనాలు పోగవుతున్నారు. దీంతో ఎక్కువ షాపులు తెరిచి.. తక్కువ మంది పోగయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు.