Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు సీఎం కె చంద్రశేఖరరావు ప్రకటించారు. బుధవారంనాడాయన ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఇంచార్జ్ ఎమ్డీ సునీల్శర్మ, డైరెక్టర్లు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురువారం నుంచి యధావిధిగా ఆర్టీసీ సర్వీసులు కొనసాగుతాయనీ, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్లోని జేబిఎస్, ఎంజిబిఎస్లలోకి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మాత్రం సిటీ బస్సులు తిరిగేందుకు అనుమతి లేదన్నారు. సిటీలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున ఇక్కడ నిషేధం కొనసాగుతుందని చెప్పారు. రాత్రి వేళల్లో బస్సుల్లో వచ్చిన ప్రయాణీకులు గమ్యస్థానాలకు చేరేందుకు బస్టాండ్లలోకి ట్యాక్సీలు, ఆటోలనూ అనుమతిస్తున్నామని వివరించారు.