Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంథని పోలీసు స్టేషనులో శీలం రంగయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మరణించటంపై విచారణ నిర్వహించి.. రిపోర్టు ఇవ్వాలంటూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను హైకోర్టు ఆదేశించింది. ఆ రిపోర్టును డీజీపీకి ఇవ్వాలనీ, ఆయన బాధ్యులైన పోలీస్లపై చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశాలిచ్చింది. ప్రతివాదులైన చీఫ్ సెక్రటరీ, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పెద్దపల్లి ఎస్పీ, మంథని సీఐ,ఎస్ఐలకు నోటీసులిచ్చింది. ఈనెల 26న రంగయ్య.. మంథని లాకప్లో మరణించాడనీ, దీనికి కారణమైన పోలీస్లపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది నాగమణి రాసిన లెటర్ను పిల్గా చేపట్టిన హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రంగయ్య భౌతిక దేహానికి రీపోస్ట్మార్టం జరిపించాలనీ, అందుకనుగుణంగా ఆదేశాలివ్వాలని, కచ్చితంగా అది హత్యేనని పిటిషనర్ తరపు లాయర్ కె.గోపాల్ వాదించారు. 22న రంగయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు, 24న కోర్టులో హాజరుపరిచారనీ తెలిపారు. తర్వాత పోలీసుల కస్టడీలో ఉండగానే ఈనెల 26న తెల్లవారుజామున బాత్ రూంలో చనిపోయి ఉన్నాడని చెప్పారు. దహన సంస్కారాలు పూర్తయ్యాక రీపోస్టుమార్టం ఎలా వీలవుతుందంటూ ప్రశ్నించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 5కి వాయిదా వేసింది.
డాక్టర్ చీటీ ప్రకారమే మందులు అమ్మాలి...
మందుల షాపులు ఇష్టారీతిన మందులు అమ్మకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. డాక్టర్లు రాసిచ్చిన చీటీ (ప్రిస్క్రిప్షన్) ప్రకారమే వాటిని అమ్మేలా చర్యలు తీసుకోవాలనే పిల్పై విచారణ చేపట్టిన కోర్టు.. ఫార్మసీ యాక్ట్లోని సెక్షన్ 42కు చెందిన వివరాలను అందజేయాలని కోరింది. ఈ మేరకు రెండు ప్రభుత్వాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైదరాబాద్కు చెందిన సీతారాంబాబు రాసిన లేఖను పిల్గా పరిగణించిన హైకోర్టు బుధవారం ప్రతివాదుల వాదనల నిమిత్తం విచారణను వాయిదా వేసింది.