Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కుమారులు దూరంగా ఉంచడం, వృద్ధాశ్రమంలో చేర్పించడం అమానుషమని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా తట్టుకుంటూ తమ పిల్లలను పెంచి పెద్ద చేస్తున్న తల్లి దండ్రులను వృద్దాప్యంలో కష్టాల పాలు చేయడం సభ్య సమాజం సిగ్గుపడే చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కానాపూర్ మండలం బుదారంలో షేక్వలి, యాఖూబీ వృద్ద దంపతులను కుమారులు ఇంటి నుంచి వెళ్లగొట్టిన సంఘటన తనను కదిలించిందని ఆయన అన్నారు. స్థానిక బస్స్టాప్లో తిండిలేక పడి ఉన్న వీరిని చూసి స్థానిక ఎస్ఐ సాయిబాబు స్పందించి వారి కుమారులకు కౌన్సిలింగ్ చేయడం, తర్వాత తల్లిదండ్రులను వారింటికి తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే అనేక ప్రజాహిత కార్యక్రమాలలో రాష్ట్ర పోలీసులు పాల్గొంటూ ప్రజల హృదయాల్లో మంచి స్థానం పొందుతున్నారని ఆయన అన్నారు. Aశ