Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాగజ్నగర్
ఆసిఫాబాద్-కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లును వారం రోజులు షట్డౌన్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. రోజురోజుకూ కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో యాజమాన్యం పేర్కొంది. రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిల్లును ఈ నెల 15 వరకు పూర్తిగా షట్డౌన్ చేస్తున్నట్టు మిల్లు వైస్ ప్రెసిడెంట్ మయాంక్ జిందాల్ పేర్కొన్నారు. కార్మికులు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లులో అత్యవసర సర్వీసులతో పాటు ప్రాజెక్టు వర్క్, ఫినిషింగ్, ప్యాకింగ్, లోడింగ్, మేజర్ మెయింటనెన్స్ పనులు మాత్రమే చేపట్టనున్నట్టు ఆ నోటీసులో పేర్కొన్నారు. వారం తర్వాత పరిస్థితులను బట్టి భవిష్యతు నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు.