Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో నగదు ఉపసంహరణలపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్యాంకు శాఖల్లో పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఇకపై అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సగటు నెలవారీ మొత్తం (ఏఎంబీ) రూ.25000 లోపు ఖాతాదారులు బ్యాంకు శాఖల్లో రెండు సార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకొనేలా పరిమితి విధించారు. రూ.25000-50000 అయితే 10 ఉపసంహరణ (విత్డ్రా)కు అవకాశం కల్పించారు. రూ.50వేల నుంచి రూ.1 లక్ష ఉంటే 15 సార్లు లావాదేవీలు జరపవచ్చును. లక్షకు పైబడిన ఆదాయం ఉంటే ఆపరిమితంగా నగదు వెనక్కి తీసుకునే వీలుంది. పరిమితి దాటిన ఖాతాదారులు మాత్రం ఒక్కో లావాదేవీకి రూ.50తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాల్లో రూ.25వేల లోపు సగటు నెలవారి ఆదాయం ఉంటే ఏటీఎంల్లో 8 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇందులో ఎస్బీఐలో ఐదు, ఇతర ఏటీఎంల్లో మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇతర నగరాల్లో ఎస్బీఐలో 5 ఇతర ఏటీఎంల్లో 5 వరకు ఉచిత ఉపసంహరణలు చేసుకోవడానికి వీలుంది. అదనపు లావాదేవీపై రూ.10 నుంచి రూ.20 వరకు చార్జిపడనున్నది.