Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-31 వరకు పొడిగింపు
- కరోనా నేపథ్యంలో సర్కారు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హాజరు గురించి.. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాష్ట్ర సచివా లయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రొటేషన్ బేసీస్లో హాజరయ్యేలా ఇప్పటికే ఆదేశాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కోవిడ్-19 వైరస్ విస్తరిస్తున్న కారణంగా ఉద్యోగుల విధులను పాత పద్ధతిలోనే నిర్వహించాలని సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.