Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా మహమ్మారి, లాక్డౌన్ను బూచిగా చూపి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ సిలబస్లో విలువైన పాఠ్యాంశాలను తొలగిస్తున్న మోడీ సర్కార్ తీరును తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, ప్రధానకార్యదర్శి టి.సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగంలోని లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ, ప్రజాసామ్య హక్కులను అణగదొక్కేలా సంఫ్ు పరివార్ శక్తుల మార్గంలోనే సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ ద్వారా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.