Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
నవతెలంగాణ - భువనగిరిరూరల్
భార్య చేసిన తప్పిదానికి కన్న కుమార్తె దారుణ హత్యకు గురవడంతో మానసికంగా కుంగిపోయిన తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికులు, రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన కళ్యాణ్రావు, కర్నూలుకు చెందిన అనూష 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2015లో కూతురు ఆద్య జన్మించింది. వారు రెండేండ్ల నుంచి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లోని యూసుఫ్గూడలో నివాసముంటున్నారు. ప్రస్తుతం కల్యాణ్రావు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నాడు. అనూషకు ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తులతో సన్నిహితం మారడం.. ఈ క్రమంలో కర్ణాకర్ అనే వ్యక్తి కళ్యాణ్రావు- అనూష కుమార్తె ఆద్యను గొంతుకోసి చంపేసిన విషయం విదితమే. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన కళ్యాణ్రావు శనివారం భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే కానిస్టేబుల్ కాంతారావు తెలిపారు.