Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డి శనివారం లాలాగూడలోని రైల్వే ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్-19 ప్రత్యేక వార్డు ఏర్పాటుతో పాటు ఆస్పత్రిలోని సౌకర్యాలపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్మాల్యా, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న కుమార్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆస్పత్రిలో కోవిడ్-19 పేషేంట్లకు అందిస్తున్న చికిత్స, వైద్య సదుపాయాలపై అధికారులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. ఫోటో ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన ఇతర సౌకర్యాలపై ప్రతిపాదనలను తనకు ఇవ్వాలనీ, దానిపై కేంద్ర రైల్వే మంత్రితో చర్చించి, నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కిషన్రెడ్డి హామీ ఇచ్చారు.