Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటలకు 'ట్రెసా' వినతి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
కోవిడ్ నియంత్రణతోపాటు విధినిర్వహణలో భాగంగా ప్రజలకు నిత్యం సేవలందిస్తూ కరోనా బారిన పడుతున్న రెవెన్యూ ఉద్యోగులకు నిమ్స్ ఆస్పత్రిలో నాణ్యమైన చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు రెవెన్యూ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె. రామకష్ణ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల్లో అనేక మంది కరోనా బారిన పడి బాధపడుతున్నారనీ, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశం సీరియస్ కండిషన్లో కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కొరకు వెంటిలేటర్తో కూడిన బెడ్ దొరకలేదన్నారు.