Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
రాంపల్లి లోని విజయ నర్సింగ్ హౌం లో సేవలందిస్తున్న పొట్లూరి సావిత్రి (75) గురువారం తెల్లవారు జామున గుండె పోటుతో కన్ను మూశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.ఆశాలత, మల్లులక్ష్మి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, సుగుణ, మణికొండ విజయవాణి, టి.జ్యోతి, ఇందిరా తదితరులు సావిత్రి మృతి పట్ల సంతాపం తెలిపారు. విజయ నర్సింగ్ హౌం వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, సత్యనారాయణ ఆమె సేవలను కొనియాడారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సావిత్రి ఉమెన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో పని చేశారు. సీఆర్ ఫౌండేషన్ కు 16 ఏండ్ల పాటు సేవలందించారు.