Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తీవ్రమవుతున్న కోవిడ్19 నివారణ కోసం చర్యలు తీసుకోవాలనీ, వైద్య ఆరోగ్య శాఖను మెరుగుపరచానీ, సచివాలయం కూల్చివేత తగదంటూ ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన శాంతియుత నిరసనను అణచివేయడాన్ని నిర్బంధ వ్యతిరేక వేదిక ఖండించింది. వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, కో కన్వీనర్లు యం. రాఘవాచారి, ఎస్. అనిత , కె రవిచందర్ సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యమాల ద్వారానే ప్రజాసమస్యలు వెలుగులోకి వస్తాయని తెలియజేసింది. ప్రభుత్వం ఆయా ఉద్యమాలు ముందుకు తెచ్చిన సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలనీ, అరెస్ట్ తదితర నిర్బంధ చర్యలకు పూనుకోవడం తగదని వ్యాఖ్యానించింది.