Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి ప్రవీణకుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సోషల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ సొసైటీ 5వ తరగతికి అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని టీఎస్డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణకుమార్ తెలిపారు. అలాంటి వార్తలు నమ్మొద్దని ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 12న జరగాల్సిన ఎంట్రెన్స్ పరీక్షలను కరోనా నేపథ్యంలో వాయిదా వేసినట్టు తెలిపారు. అయితే ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత లాటరీ పద్దతి ద్వారా అడ్మిషన్లు ఇస్తామనీ, అప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.