Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్నగర్
ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్నగర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రాములు సతీమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ సోమవారం సాయంత్రం హైదరాబాదులోని కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. ఆమె మృతితో జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వాడాల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గతంలో సీపీఐ(ఎం) నుంచి గ్రామ సర్పంచిగా ఎన్నికై గ్రామాభివృద్ధికి ఆమె చేసిన కృషిని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. హైదరాబాద్ కిడ్నీ అస్పత్రిలో అరుణ మృతదేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బి.వెంకట్, ఎం. సాయిబాబు సందర్శించి నివాళుర్పించారు. ఆమె మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల, నారాయణపేట జిల్లాల కార్యదర్శులు ఎండీ జబ్బార్, పర్వతాలు, వెంకటస్వామి, వెంకట్రాంరెడ్డి వేర్వేరుగా సంతాపం ప్రకటించారు.
తమ్మినేని సంతాపం
హైదరాబాద్ కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఐద్వా మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి ఆనెగళ్ల అరుణ మృతి జిల్లా మహిళా ఉద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. నేడు మహబూబ్నగర్లో జరగనున్న ఆమె అంత్యక్రియలకు తమ్మినేనితో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, బి. వెంకట్ హాజరుకానున్నారు.