Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుస ఘటనలకు బాధ్యతగా..
నవతెలంగాణ-నిజామాబాద్సిటీ
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వర్రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆస్పత్రిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నానని రాజీనామా పత్రాన్ని సోమవారం డీఎంఈకి, కలెక్టర్కు అందజేశారు.
గత నెలలో జనరల్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చారు. కాగా, ఇటీవల ఆక్సిజన్ సమయానికి అందక ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారని ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు వారిలో ఒకరి మృతదేహాన్ని ఆటోలో తరలించడం సైతం వివాదాస్పదమైంది. అయితే, కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన తర్వాత ఆస్పత్రి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు విధులకు హాజరు కాకపోవడంతో జూనియర్ వైద్యులపై భారం పడిందన్న విమర్శలూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు సూపరింటెండెంట్ ప్రకటించారు.