Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-చాడ, కోదండరామ్, సంపత్లనుఅరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సచివాలయం కూల్చివేతను నిరసిస్తూ గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి నిరసన తెలిపేందుకే ప్రయత్నించిన పలు పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసన కార్యక్రమం నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి పోలీసులు భారీగా మొహరించారు. విడివిడిగా వచ్చిన నాయకులను అమరవీరుల స్థూపం వరకూ వెళ్ళనీయలేదు. కారు దిగగానే వెంటనే పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో గన్పార్క్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి చేరుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణను పోలీసులు అరెస్టు చేశారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాy్ు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత కె గోవర్ధన్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఎ.సంపత్కుమార్ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయాన్ని కూల్చివేయొద్దని ఎన్ని సార్లు అన్ని రాజకీయ పార్టీలూ ప్రభుత్వానికి చెప్పినా వినడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. చివరకు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే సచివాలయాన్ని కూల్చేశారని విమర్శించారు. కొత్త సచివాలయం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కనీసం అమరవీరులకు కూడా నివాళులు అర్పించనీయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎఐసీసీ కార్యదర్శి ఎస్ఎ సంపత్కుమార్ అన్నారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కనీసం నిరసనకూ అవకాశమివ్వకపోవడం అన్యాయమన్నారు. దేశంలో ముంబరు తర్వాత హైదరాబాద్లోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతు న్నాయని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ వివరించారు. సచివాలయ కూల్చివేతపై అఖిలపక్ష సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవటం అన్యాయమన్నారు. సీఎం కేసీఆర్కు ప్రతిపక్షాలంటే చిన్నచూపు అని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్దన్ అన్నారు.