Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, వైరసన నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈనెల 16న ప్రభుత్వాస్పత్రుల ఎదుట ఒక రోజు నిరసన దీక్ష చేపట్టనున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా పెద్దఎత్తున విజృంభిస్తున్నా ప్రభుత్వాలు నివారణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైరస్ను నివారించాల్సిన సమయంలో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి సచివాలయం నిర్మించడం సరికాదన్నారు.