Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి ప్రశంస
నవతెలంగాణ - సుల్తానాబాద్ రూరల్
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్న కరోనా సర్వే లైన్ ఆఫీసర్ డాక్టర్ పెండ్యాల శ్రీరాంను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం ట్విట్టర్ వేదికగా అభినందించారు. కరోనా వైరస్తో చనిపోయిన వ్యక్తి భౌతికకాయం తరలించడానికి మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో డాక్టరే స్వయంగా ట్రాక్టర్ నడపి శ్మశానవాటికకు తీసుకెళ్లడాన్ని కొనియాడారు. వైద్యుడుగా శ్రీరామ్ చొరవ ఎందరికో ఆదర్శమని ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఓ కరోనా పేషెంట్ మతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన మున్సిపల్ సిబ్బంది అందుబాటులో లేకుండాపోయారు. ఆస్పత్రి సిబ్బంది వారికి ఫోన్ చేసినా స్పందించలేదు. ఐసోలేషన్ వార్డు నుంచి మతదేహాన్ని తరలించాలని పేషెంట్లు కోరారు. అయితే, అక్కడే ఉన్న వాహన డ్రైవర్ తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దాంతో కరోనా నియంత్రణ కోసం నియమించిన జిల్లా ప్రత్యేక వైద్యాధికారి శ్రీరామ్ స్పందించారు. మృతదేహాన్ని సిబ్బందితో కలిసి ట్రాక్టర్లో పెట్టించి, ఆయనే స్వయంగా ట్రాక్టర్ను నడుపుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లారు.