Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పలు రాష్ట్రాలను వివరణ కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వాయుకాలుష్యానికి కారణమౌతున్న పంట వ్యర్థాల దహనాన్ని నిరోధించేందుకు ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది వ్యర్థాలను దహనం చేసిన సందర్భాలు, ఆయా ప్రాంతాలు, ఎంత మంది రైతులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో కూడా వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్రాలను కోరింది. ఇలాంటి వివరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా ప్రత్యేక ఏర్పాటు చేయవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణ నాటికి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చెబితే..తాము వినాలనుకుంటున్నామని...జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాలుష్యం అంశంపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ దహనాన్ని నిరోధించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అగ్రికల్చరల్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసినట్లు తెలిసిందని, సంబంధిత రాష్ట్రాలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కూడా ఆదేశిస్తూ..తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.