Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సెన్సెక్స్ 667 పాయింట్ల క్షీణత.. 11వేల దిగువన నిఫ్టీ
- విత్త సూచీల విలవిల
- రిలయన్స్ సూచీ 2.88% పతనం
ముంబయి: వరుసగా నాలుగో సెషన్లో నూ భారత స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. రిలయన్స్ ఇండిస్టీస్, ప్రయివేటు బ్యాంక్ సూచీల అమ్మకాల ఒత్తిడితో సోమ వారం భారీ నష్టాల పాలయ్యాయి. వచ్చే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనుందన్న అంచ నాలకు తోడు దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు మదుపర్లలో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 667 పాయింట్లు లేదా 1.77 శాతం క్షీణించి 36,940కి పడిపోయింది. 30 సూచీల్లో 24 స్టాక్స్ కూడా ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. నిఫ్టీ 174 పాయింట్లు లేదా 1.57 శాతం తగ్గి 11వేల దిగువన 10,900 వద్ద ముగిసింది. సమయం గడిచేకొద్దీ అమ్మకాలు ఊపందుకోవడంతో తొలుత 11,058 వద్ద గరిష్టాన్ని తాకిన నిఫ్టీ.. తదుపరి 10,882 కనిష్టాన్ని చేరింది. నిఫ్టీలో రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ ఏకంగా 2.88 శాతం లేదా రూ.59.45 పతనమై రూ.2,007.65కు పడిపోయింది. రూ.2,051 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో రూ.2,057 గరిష్ట స్థాయికి చేరగా.. మరో దశలో రూ.2,003 కనిష్ట స్థాయికి పడిపోయింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13.22 లక్షల కోట్లకు తగ్గింది.
నిప్టీలో ప్రయివేటు బ్యాంకింగ్ సూచీ 3 శాతం విలువ కోల్పోయింది. మరోవైపు పీఎస్యూ బ్యాంకింగ్ సూచీ 0.5 శాతం పెరిగింది. విత్త సేవల సూచీ 2.18 శాతం, రియాల్టీ 1.24 శాతం, 0.64 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.31 శాతం నష్టపోగా.. స్మాల్ క్యాప్ 1 శాతం రాణించింది. సెన్సెక్స్-30లో టైటన్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్, ఎల్అండ్టి, ఎస్బిఐ, నెస్ల్టే సూచీలు మాత్రమే లాభపడ్డాయి. ఇండుస్ఇండ్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2.36 శాతం నుంచి 3.67 శాతం మధ్య విలువ కోల్పోయాయి. నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ.959 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
ఐదేండ్ల కనిష్టానికి చమురు దిగుమతులు
-జూన్ ఎగుమతుల్లోనూ క్షీణతఐదేండ్ల కనిష్టానికి చమురు దిగుమతులు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జూన్ మాసంలో భారత ముడి చమురు దిగుమతులు 2015 ఫిబ్రవరి కనిష్టానికి పడిపోయాయి. అదే విధంగా ఈఏడాదిలో తొలిసారి రిఫైన్డ్ చమురు ఎగుమతుల్లోనూ తగ్గు దల చోటు చేసుకుంది. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. గడిచిన మాసం లో ముడి చమురు దిగుమతులు 19 శాతం పతనమై 13.68 మిలి యన్ టన్నులకు పరిమితమయ్యాయి. దీంతో వరుసగా మూడో మా సంలోనూ చమురు దిగుమతుల్లో పతనం చోటు చేసుకున్నట్టయింది. ఈపరిణామం దేశంలో డిమాండ్ పతనాన్ని స్పష్టం చేస్తుందని యూబీ ఎస్ అనలిస్టు గివన్ని స్టనోవొ పేర్కొన్నారు. దేశంలో చమురుకు గిరాకీ పెరగడానికి దీర్ఘకాలమే పట్టొచ్చని అంచనా వేశారు. ప్రపంచంలోనే చమురు దిగుమతుల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నది.