Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నూతన సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్గా శశిధర్ జగదీషన్ నియమితులయ్యారు. ఆ బ్యాంక్ ప్రతిపాదించిన 55 ఏళ్ల శశిధర్ నియామకాన్ని ఆర్బిఐ ఆమోదించింది. అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు. 1996లో బ్యాంకులో చేరిన జగదీషన్ ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, తదితర విభాగాల హెడ్గా పని చేశారు. ప్రస్తుత ఎండి, సిఇఒ ఆదిత్య పూరి అక్టోబర్ 26తో పదవీకాలం ముగియనుంది. పూరి స్థానంలో శశిధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. శశిధర్ నియామకాన్ని ఆమోదించడానికి బ్యాంకు బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్ణీత సమయంలో సమావేశమవుతుందని, అదే విధంగా ఆర్బిఐ నిర్ణయాన్ని పలు రెగ్యూలేటరీ సంస్థలకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమాచారమిచ్చింది.