Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీపీఐ(ఎం) ఏపీ సీనియర్ నేత కన్నుమూత
-దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు
కర్నూలు : సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు, సీపీఐ(ఎం) కర్నూలు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.షడ్రక్ అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతిచెందారు. టి.షడ్రక్ (62) ఆయన భార్య అన్నపూర్ణమ్మకూ కరోనా పాజిటివ్ వచ్చింది. టి.షడ్రక్ కరోనాతో పోరాడి మృతిచెందారు. ఆయన భార్య పోరాడి కోలుకున్నారు. టి.షడ్రక్ , ఆయన భార్య అన్నపూర్ణమ్మ గత వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్లో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.
టి.షడ్రక్ కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామంలో 1958 జూన్ 4న అభిషేలోన్,భాగ్యమ్మ దంపతులకు జన్మించారు. ఆయనది దళిత నిరుపేద వ్యవసాయ కార్మిక కుటుంబం. ఆయనకు భార్య అన్నపూర్ణ, కుమారుడు వినోద్ ఉన్నారు. అయన ఎస్ఎస్సీ, ఐటీఐ వరకు చదివారు. 1978లో సీపీఐ(ఎం) సభ్యత్వం తీసుకున్నారు. 1978లో రాయలసీమ పేపర్ మిల్లు లో సాధారణ కార్మినిగా చేరారు. ఫ్యాక్టరీలో స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఏర్పాటు చేసి మేనేజ్మెంట్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ క్రమంలో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయనను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు 21 రోజులపాటు సమ్మె చేశారు. మేనేజ్ మెంట్ మొండి వైఖరి వల్ల ఆయనను విధుల్లోకి తీసుకోలేదు. నిర్బంధానికి బెదరకుండా సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తగా ముందుకు వచ్చారు. అ తరువాత 1982 సం.లో కార్మైడ్ ప్యాక్టరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్కు (సీఐటీయూ) వైస్ ప్రెసిడెంట్ గా, గ్లాస్ ఫ్యాక్టరీ, ఎం.జి బ్రదర్స్ యూనియన్, ఆయిల్ మిల్లు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. 1983లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించారు. ఆదోని, నంద్యాల, పాణ్యం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, కర్నూలు నగరంలో వివిధ రకాల కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి రాజీలేని పోరాటాలు నిర్వహించారు. 1984 నుంచి 1992 వరకు సీపీఐ(ఎం) నగర కార్యదర్శిగా పని చేశారు. జిల్లాలో విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన కృషి సీపీఐ(ఎం) అభివృద్ధికి దోహదపడింది. 1992 నుంచి 2001 వరకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా , ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఆ తర్వాత 1994 కర్నూలు అసెంబ్లీ నియోజకర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎంఏ.గఫూర్ గెలుపుకోసం అహర్నిశలు కషిచేశారు. 1995 నుంచి 1999 వరకు ఇందిరాగాంధీ నగర్ సీపీఐ(ఎం) కార్పొరేటర్గా పని చేశారు. ఆ వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారు. 2009 నుంచి 2012 వరకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని 54 మండలాల్లో సీపీఐ(ఎం), ప్రజాసంఘాల అభివద్ధికి కృషి చేశారు. 2002 నుంచి 2018 వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యునిగా కొనసాగుతున్నారు.
పలువురి నివాళి
టి.షడ్రక్ మతి జిల్లా, రాష్ట్ర ఉద్యమానికి తీరనిలోటని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గపూర్, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల నివాళులర్పించారు.
ఏచూరి సంతాపం
సీపీఐ(ఎం) అభిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫోన్ ద్వారా గపూర్ తో మాట్లాడి షడ్రక్ మృతికి సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీనియర్ సాయకులు రామచంద్రయ్య, రామాంజనేయులు ,సంతాపం తెలిపారు.