Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల పక్ష సమావేశం, నిరసనలపై అణచివేత
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించి ఆగస్టు 5నాటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) పిలుపునిచ్చిన సమావేశాన్ని, నిరనన ర్యాలీని అడ్డుకునేందుకు కాశ్మీర్ అంతటా కేంద్రం నిర్బంధాన్ని ప్రయోగించింది. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు అన్ని స్థానిక పార్టీలతో సమావేశానికి ఎన్సి అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు ఫరూఖ్ అబ్దుల్లా అధ్యక్షతన గుప్కర్ రోడ్డులోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ప్రత్యేక హోదాను పరిరక్షించుకోవడమే ఉమ్మడి ఫ్రంట్ లక్ష్యమని పేర్కొంటూ గత ఏడాది ఆగస్టు 4న స్థానిక పార్టీలు సంతకం చేసిన గుప్కర్ డిక్లరేషన్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు అబ్దుల్లా చెబుతున్నారు. దీంతో గుప్కర్ రోడ్డు, అబ్దుల్లా నివాసం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, సిపిఎం, పిడిపి, పీపుల్స్ కాన్ఫరెన్స్, జెకె పీపుల్స్ మూమెంట్, అవామీ నేషనరల్ కాన్ఫరెన్స్ల నేతలు హాజరు కావాల్సి ఉంది. ప్రత్యేక హోదా రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భం గా బిజెపి 15 రోజుల పాటు ఉత్సవాలను ప్రకటించిందనీ, రాజకీయ ప్రక్రియ మొదలైంద ని ప్రభుత్వం చెబుతుందనీ, ఒక్క నేత కూడా తమ ఇంటికి రావడానికి అనుమతి లేదని ఎన్సి ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.
పిడిపి నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆగస్టు 5న బ్లాక్డేగా పాటించాలని, నిరసనలు చేపట్టాలని పిడిపి పిలుపునిచ్చిన నేపథ్యంలో కిస్తావర్ నుండి మాజీ శాసన సభ్యుడు ఫిర్దోస్ టక్తోపాటు పలువురు ఆ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. , జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో కర్ఫ్యూని ఎత్తివేసినప్పటికీ, ప్రజా సంచారానికి అనుమతించలేదు.