Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై చైనా తన వ్యతిరేకతను మరోమారు వ్యక్త పరిచింది. ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో తీసుకునే ఎటువంటి ఏకపక్ష చర్యలైనా చట్టవిరుద్ధమని, చెల్లవని పేర్కొంది. జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని మోడీ ప్రభుత్వం రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా చైనా విదేశాంగ శాఖ బుధవారం ఈ మేరకు స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ కాశ్మీర్ ప్రాంతంలోని పరిస్థితులను చైనా నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ఈ విషయంలో తమ దేశ వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉందని తెలిపారు. కాశ్మీర్ సమస్య భారత్, పాక్ల మధ్య అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందని, అప్పటి పాలకులు అలాగే వదిలేశారని చెప్పారు. సమస్యను పూర్తిగా శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్, పాక్లు శాంతియుత మార్గంలో మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం ద్వారా ఇరు దేశాల ప్రయోజనాలు నెరవేరుతాయని పేర్కొన్నారు.