Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ, ప్రయివేటు వ్యయం పెరగాలి
- ఎస్బిఐ చీఫ్ రజ్నీష్ కుమార్
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా పుంజుకోవాలంటే కార్పొరేట్లు పెట్టుబడులను పెంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఛైర్మన్ రజ్నీష్ కుమార్ అన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల రంగంలో వ్యయాలు పెరగాలని సూచించారు. ఆర్బిఐ పరిమిత కాలం కోసం ప్రకటించిన ప్రస్తుత మారటోరియం సౌలభ్యం లక్ష్యం నెరవేరిందని ఇటికి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం, కార్పొరేట్లు తమ వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆ నగదు తిరిగి వినిమయ డిమాండ్, మౌలిక వసతుల కల్పనకు దోహదం చేయనుందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ గ్రామీణ ప్రాంత డిమాండ్ను పెంచిందన్నారు. కాగా కరోనా కాలంలో మధ్య తరగతి ప్రజల వ్యయాలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోశించాయన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ మారటోరియం అవసరం లేదని రజ్నీష్ కుమార్ అన్నారు. భవిష్యత్తు చర్యలను రుణగ్రహీతలకు, బ్యాంక్లకు వదిలేయ్యాలని సూచించారు. దేశ జిడిపి 10 శాతం ప్రతికూల వృద్థిని చవి చూడనుందన్న ఆర్ధిక నిపుణుల అంచనాలపై రజ్నీష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. గడిచిన జూన్లో మంచి రికవరీ కనబడిందన్నారు. పరిశ్రమలు దాదాపుగా 75-80 శాతం సామర్థ్యంతో నడిచాయన్నారు. స్థానిక ప్రభుత్వాల లాక్డౌన్ నిబంధనల వల్ల సరఫరా చెయిన్లో కొన్ని ఇబ్బందులు కొనసాగుతున్నాయన్నారు. అయినా ఏప్రిల్, మే కాలంతో పోల్చితే మెరుగైన స్థాయిలోనే ఉన్నామని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.