Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ: నకిలీ ఇంటి పన్నుల పుస్తకాలతో మధురవాడలోని 180 గజాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి, టిడిపి నాయకులు గంటా శ్రీనివాసరావు మేనల్లుడు వద్ద కారు డ్రైవరుగా 2014లో పనిచేసిన మల్లెల విజరుకుమార్, మరోవ్యక్తి తమ్మినేని రమణలను శనివారం పిఎం.పాలెం పోలీసులు అరెస్టు చేశారు. గంటా బంధువు, అనుచరుడు గంటా లక్ష్మణరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిఎం.పోలీసుల కథనం ప్రకారం.. మధురవాడ వికలాంగుల కాలనీలోని 388 సర్వే నంబరులో రెండు బిట్లు (90+90) మొత్తం 180 గజాల ప్రభుత్వ స్థలానికి జివిఎంసి ఇంటి పన్ను పుస్తకాలు నకిలీవి చూపించి ప్రభుత్వ అధికారుల కళ్లు కప్పి పైనతెలిపిన ముగ్గురు రెగ్యులరైజేషన్ చేయించుకున్నారు. దీనివిలువ సుమారు కోటి రూపాయలు ఉంటుంది. భూకబ్జాకు ఆధారాలు ఉన్నాయని విశాఖ రూరల్ తహశీల్దారు ఆర్.నర్సింహమూర్తి ఈ సందర్భంగా మీడియా తెలిపారు.